జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- January 10, 2026
మస్కట్: జబల్ షమ్స్లో దేశంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత -2.2°C గా అధికారికంగా నమోదైంది. ఈ మేరకు ఒమన్ వాతావరణ కార్యాలయం తన తాజా నివేదికలో తెలిపింది. ఇది ప్రస్తుత వింటర్ సీజన్ లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత అని తెలిపింది.
అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలు గడ్డకట్టే స్థాయికి చేరుకున్నాయని, దక్షిణ గవర్నరేట్లు మాత్రం ఇంకా వేడి వాతావరణం ఉందని వెల్లడించింది. ఎత్తైన ప్రాంతాలు మరియు లోపలి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, జబల్ షమ్స్ తర్వాత, సైక్లో 3.4°C కనిష్ట ఉష్వగ్రత నమోదైనట్లు పేర్కొంది. మఖ్షాన్ మరియు హైమాలో ఉష్ణోగ్రతలు 9°C నుండి 10°C మధ్య ఉన్నాయని తెలిపింది.
అల్ ధాహిరా మరియు అల్ బురైమి నివాసితులు తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







