ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- March 10, 2026
న్యూ ఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పీటర్ ఎల్బర్స్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. తన నోటీసు పీరియడ్ను కూడా రద్దు చేయాలని కోరినట్లు సమాచారం. కంపెనీ ప్రకటన ప్రకారం మార్చి 10 నుంచి ఈ రాజీనామా అమల్లోకి వచ్చింది.
కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. విమానయాన సంస్థలో సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం ప్రధాన లక్ష్యమని ఇండిగో బోర్డు తెలిపింది.
ఇండిగో బోర్డు ప్రస్తుతం కొత్త సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించింది. త్వరలోనే సంస్థకు కొత్త నాయకత్వాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇండిగోను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









