తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- March 10, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన జీఓ నంబర్ 30ని విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచే సాయంత్రం తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఈ ఫైలుపై సంతకం చేయడంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిప్లొమా అభ్యర్థుల కల నెరవేరబోతోంది. ఒక్కో కోర్సులో కనిష్టంగా 15 నుండి గరిష్టంగా 60 సీట్ల వరకు కేటాయిస్తూ విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ సాయంత్రం పూట కోర్సుల్లో చేరడానికి పాలిటెక్నిక్ (Polytechnic) పూర్తి చేసి కనీసం ఏడాది పాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంటెక్ కోర్సుల్లో కూడా చేరే అవకాశం కల్పించారు. దీనికోసం ప్రత్యేకంగా జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఈ పరీక్ష బాధ్యతలను పర్యవేక్షిస్తారు. రెగ్యులర్ కోర్సులకు ఎంత ఫీజు ఉంటుందో, ఈ సాయంత్రం కోర్సులకు కూడా అదే ఫీజు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి హైదరాబాద్లోని సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, ఎంవీఎస్ఆర్ వంటి టాప్ కాలేజీలతో పాటు జిల్లాల్లోని ప్రముఖ సంస్థలకు అనుమతులు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం లోని అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్, మహబూబ్నగర్లోని జయప్రకాశ్ నారాయణ కాలేజీ వంటి 12 సంస్థల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి ఉద్యోగాల్లో చేరిన వారికి మళ్ళీ ఉన్నత విద్యను అభ్యసించే గొప్ప అవకాశం లభించింది. త్వరలోనే అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









