తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- March 10, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన జీఓ నంబర్ 30ని విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచే సాయంత్రం తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఈ ఫైలుపై సంతకం చేయడంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిప్లొమా అభ్యర్థుల కల నెరవేరబోతోంది. ఒక్కో కోర్సులో కనిష్టంగా 15 నుండి గరిష్టంగా 60 సీట్ల వరకు కేటాయిస్తూ విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ సాయంత్రం పూట కోర్సుల్లో చేరడానికి పాలిటెక్నిక్ (Polytechnic) పూర్తి చేసి కనీసం ఏడాది పాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంటెక్ కోర్సుల్లో కూడా చేరే అవకాశం కల్పించారు. దీనికోసం ప్రత్యేకంగా జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఈ పరీక్ష బాధ్యతలను పర్యవేక్షిస్తారు. రెగ్యులర్ కోర్సులకు ఎంత ఫీజు ఉంటుందో, ఈ సాయంత్రం కోర్సులకు కూడా అదే ఫీజు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి హైదరాబాద్లోని సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, ఎంవీఎస్ఆర్ వంటి టాప్ కాలేజీలతో పాటు జిల్లాల్లోని ప్రముఖ సంస్థలకు అనుమతులు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం లోని అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్, మహబూబ్నగర్లోని జయప్రకాశ్ నారాయణ కాలేజీ వంటి 12 సంస్థల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి ఉద్యోగాల్లో చేరిన వారికి మళ్ళీ ఉన్నత విద్యను అభ్యసించే గొప్ప అవకాశం లభించింది. త్వరలోనే అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







