గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- January 17, 2026
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక ప్రకారం.. గాజా స్ట్రిప్ తాత్కాలిక పరిపాలనను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులలో కొంతమందిని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక జాబితా విడుదల చేశారు.
ఈ జాబితాలో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, మాజీ UK ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రైవేట్ ఈక్విటీ బిలియనీర్ మార్క్ రోవాన్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా మరియు ట్రంప్ సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. మిడిల్ ఈస్ట్ శాంతి ప్రక్రియ కోసం మాజీ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమన్వయకర్త నికోలాయ్ మ్లాడెనోవ్ గాజాకు హై ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే వారాల్లో అదనపు సభ్యులను ప్రకటిస్తామని వైట్ హౌజ్ పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







