రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- January 18, 2026
అబుదాబి: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ జనవరి 19న భారతదేశానికి అధికారిక పర్యటనకు రానున్నారు.ఈ పర్యటనతో భారత్–యూఏఈ మధ్య వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టం కానుంది.
యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ భారత్ను సందర్శించడం ఇది మూడోసారి కాగా, గత పదేళ్లలో ఇది ఆయన ఐదో భారత పర్యటన కావడం విశేషం.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి పర్యటనల ద్వారా ఏర్పడిన సానుకూల వాతావరణానికి ఈ పర్యటన కొనసాగింపుగా నిలుస్తుంది. 2024 సెప్టెంబరులో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటన, అలాగే 2025 ఏప్రిల్లో యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రి మరియు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారత్ను సందర్శించిన సంగతి తెలిసిందే.
భారత్ మరియు యూఏఈ మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో బలమైన, బహుముఖ సంబంధాలు ఉన్నాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA), స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ (LCS) విధానం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం వంటి చర్యలతో ఇరు దేశాలు పరస్పరంగా ముఖ్యమైన వాణిజ్య, పెట్టుబడి భాగస్వాములుగా ఎదిగాయి. ఇంధన రంగంలో కూడా దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలతో బలమైన సహకారం కొనసాగుతోంది.
ఈ పర్యటన సందర్భంగా భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఇరు నాయకులకు అవకాశం లభిస్తుందని MEA తెలిపింది. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర ఆసక్తి కలిగిన విషయాలపై అభిప్రాయాల మార్పిడి జరగనుందని, ఈ అంశాల్లో ఇరు దేశాల మధ్య అధిక స్థాయి ఏకాభిప్రాయం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









