భరణి దర్శకత్వం లో వినాయక్...
- July 28, 2016
టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరైన వినాయక్ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు. మిథునం సినిమాతో తనకంటూ ప్రత్యేకతను చాటిన తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోయే ఓ షార్ట్ఫిలింకు ఈ మాస్ డైరెక్టర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భరణి దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిలింకు 'లాస్ట్ ఫార్మర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ షార్ట్ఫిలిం నిర్మిస్తున్న వినాయక్... మంచి కథతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ దొరికితే మరిన్ని వాటిని నిర్మించేందుకు రెడీ అంటున్నాడు. మరోవైపు చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు వినాయక్. ఇదిలాఉంటే.. గతంలో తనికెళ్ల భరణి తెరకెక్కించిన 'సిరా' చిత్రం మంచి పేరును పొంది విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా 'మిథునం' చిత్రం కూడా మంచి గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న షార్ట్ఫిలిం త్వరలో పట్టాలెక్కనుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







