జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- January 21, 2026
మస్కట్: ఒమన్ అంతటా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ టెంపరేచర్ మైనస్ 0.1 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిందని పౌర విమానయాన అథారిటీ (CAA) విడుదల చేసిన డేటా తెలిపింది.
మస్కట్ నుండి ఎత్తైన ప్రాంతానికి తరచుగా ప్రయాణించే వారు ఉష్ణోగ్రతలలో భారీ మార్పులను చూస్తున్నట్లు తెలిపారు. "రాత్రిపూట గాలి చాలా బలంగా ఉంది. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది. భారీ దుస్తులు ధరించినప్పటికీ, ఎక్కువసేపు బయట ఉండటం కష్టంగా ఉంది," అని భారతీయ ప్రవాస సూరజ్ కుమార్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఇక సైక్లో 4.8°C, యాంకుల్లో 9.5°C , నిజ్వాలో 11.5°C నమోదు కాగా, ఫహూద్ 11.5°C మరియు ముఖ్షిన్ 11.3°C, హైమాలో 11.0°C, అస్ సునైనాలో 11.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటుందని, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వాహనదారులకు లో విజిబిలిటీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







