ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- January 21, 2026
దోహా: ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్గార్టెన్లు సామాజిక బాధ్యత కార్యక్రమం కింద ఆయా సీట్లను ఆఫర్ చేస్తున్నాయని, ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ నమోదు చేసుకోవాలని సూచించింది. మొత్తం 3,500 కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఒకసారి జాయిన్ అయిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసే వరకు ఇది స్కీమ్ కొనసాగుతుందని తెలిపింది.
ఇక ఉచిత సీట్ల కోసం మొత్తం కుటుంబ ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్ను మించకూడదు. రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్గా నిర్ణయించారు. ఖతారీ విద్యార్థుల కోసం కేటాయించిన సీట్లు 25,000 రియాల్స్కు మించని ఆదాయం ఉన్న కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









