ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- January 21, 2026
దోహా: ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్గార్టెన్లు సామాజిక బాధ్యత కార్యక్రమం కింద ఆయా సీట్లను ఆఫర్ చేస్తున్నాయని, ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ నమోదు చేసుకోవాలని సూచించింది. మొత్తం 3,500 కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఒకసారి జాయిన్ అయిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసే వరకు ఇది స్కీమ్ కొనసాగుతుందని తెలిపింది.
ఇక ఉచిత సీట్ల కోసం మొత్తం కుటుంబ ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్ను మించకూడదు. రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్గా నిర్ణయించారు. ఖతారీ విద్యార్థుల కోసం కేటాయించిన సీట్లు 25,000 రియాల్స్కు మించని ఆదాయం ఉన్న కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









