ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- January 21, 2026
దోహా: ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్గార్టెన్లు సామాజిక బాధ్యత కార్యక్రమం కింద ఆయా సీట్లను ఆఫర్ చేస్తున్నాయని, ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ నమోదు చేసుకోవాలని సూచించింది. మొత్తం 3,500 కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఒకసారి జాయిన్ అయిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసే వరకు ఇది స్కీమ్ కొనసాగుతుందని తెలిపింది.
ఇక ఉచిత సీట్ల కోసం మొత్తం కుటుంబ ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్ను మించకూడదు. రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్గా నిర్ణయించారు. ఖతారీ విద్యార్థుల కోసం కేటాయించిన సీట్లు 25,000 రియాల్స్కు మించని ఆదాయం ఉన్న కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







