సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- January 21, 2026
అమెరికా: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో సెయింట్ లూయిస్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక మహాత్మగాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిస్థానిక తెలుగు వారితో పాటు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి (ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ శేఖర్ వంగల (సైకియాట్రిస్ట్) రోగులకు వైద్య సేవలు అందించారు. రోగుల ఆరోగ్య సమస్యలను నిశితంగా పరిశీలించిన వైద్యులు, వారికి అవసరమైన పలు రకాల వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మిస్సోరీలో నాట్స్ చేపడుతుందని తెలిపారు. ప్రతి నెల మిస్సోరీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులను, మిస్సోరీ నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!









