సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- January 21, 2026
అమెరికా: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో సెయింట్ లూయిస్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక మహాత్మగాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిస్థానిక తెలుగు వారితో పాటు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి (ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ శేఖర్ వంగల (సైకియాట్రిస్ట్) రోగులకు వైద్య సేవలు అందించారు. రోగుల ఆరోగ్య సమస్యలను నిశితంగా పరిశీలించిన వైద్యులు, వారికి అవసరమైన పలు రకాల వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మిస్సోరీలో నాట్స్ చేపడుతుందని తెలిపారు. ప్రతి నెల మిస్సోరీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులను, మిస్సోరీ నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









