విద్యాబాలన్ని సావిత్రి పాత్ర కోసం ఎంపిక ..
- July 28, 2016
తెలుగు తెరపై అలనాడు ఓ వెలుగు వెలిగిన మహానటి సావిత్రి. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువై తల్లిగా.. చెల్లిగా.. ఆత్మీయురాలిగా వారి గుండెల్లో నిలిచిపోయింది. అంత గొప్ప పేరు తెచ్చుకున్న మహానటి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను.. కష్టనష్టాలను చవిచూశారు. చివరకు విషాద పరిస్థితుల్లోనే తనువు చాలించారు.
అయితే ప్రస్తుతం ఆమె జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారట.బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన విద్యాబాలన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. సావిత్రిలాగే ఆమెకు కూడా తెలుగు.. తమిళం.. హిందీ.. వంటి పలుభాషల్లో ప్రావీణ్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.''సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీల్లో ఎవ్వరూ మహానటి అని పిలిపించుకోలేకపోయారు. ఆమె జీవితకథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందుకే ఆమె బయోపిక్ తీయాలనుకుంటున్నా'' అని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







