విద్యాబాలన్ని సావిత్రి పాత్ర కోసం ఎంపిక ..
- July 28, 2016
తెలుగు తెరపై అలనాడు ఓ వెలుగు వెలిగిన మహానటి సావిత్రి. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువై తల్లిగా.. చెల్లిగా.. ఆత్మీయురాలిగా వారి గుండెల్లో నిలిచిపోయింది. అంత గొప్ప పేరు తెచ్చుకున్న మహానటి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను.. కష్టనష్టాలను చవిచూశారు. చివరకు విషాద పరిస్థితుల్లోనే తనువు చాలించారు.
అయితే ప్రస్తుతం ఆమె జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారట.బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన విద్యాబాలన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. సావిత్రిలాగే ఆమెకు కూడా తెలుగు.. తమిళం.. హిందీ.. వంటి పలుభాషల్లో ప్రావీణ్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.''సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీల్లో ఎవ్వరూ మహానటి అని పిలిపించుకోలేకపోయారు. ఆమె జీవితకథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందుకే ఆమె బయోపిక్ తీయాలనుకుంటున్నా'' అని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







