ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- January 22, 2026
దోహా: శాంతి మండలిలో చేరాలన్న అమెరికా అధ్యక్షుడి పిలుపును ఎనిమిది అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు స్వాగతించాయి. ఖతార్ , టర్కీ , ఈజిప్ట్ , జోర్డాన్, ఇండోనేషియా , పాకిస్తాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రులు ఈ మేరకు ట్రంప్ ఆహ్వానాన్ని స్వాగతించారు. శాంతి మండలిలో చేరాలనే తమ దేశాల ఉమ్మడి నిర్ణయాన్ని మంత్రులు ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని శాంతి ప్రయత్నాలకు తమ దేశాల మద్దతును మంత్రులు పునరుద్ఘాటించారు.
గాజా సంఘర్షణను ముగించడానికి రూపొందించిన సమగ్ర ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803 ద్వారా ఆమోదించిన శాంతి మండలి లక్ష్యానికి మద్దతు తెలిపారు. శాశ్వత కాల్పుల విరమణను పటిష్టం చేయడం, గాజా పునర్నిర్మాణానికి మద్దతు ఇవ్వడం మరియు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా పాలస్తీనియన్ల స్వీయ-నిర్ణయాధికారం కల్పించే హక్కు సాధించే చర్యలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







