చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- January 24, 2026
కువైట్: కువైట్ లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లలో చలి కుంపట్లు వేసుకోవడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో జనరల్ ఫైర్ ఫోర్స్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇళ్ళు లేదా గుడారాల లోపల కోల్ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ ఫైర్ ఫోర్స్లోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గరీబ్ అల్-రాయ్ సూచించారు.
కోల్ ను మండిచడం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు విడుదల అవుతుందని, ఇది సైలంట్ కిల్లర్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా మూసివున్న ప్రాంతాలలో ఇది వేగంగా పేరుకుపోతుందని, తక్కువ సమయంలోనే స్పృహ కోల్పోయి ఊపిరాడక అపస్మారక స్థితికి చేరతారని హెచ్చరించారు.
ఇళ్ళు, గదులు లేదా మూసివున్న గుడారాల లోపల కోల్ ను ఉపయోగించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఒకవేళ దానిని ఉపయోగించాల్సి వస్తే, తగినంత వెంటిలేషన్ ఉన్న బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఉపయోగించాలని సూచించారు. రాత్రి సమయాల్లో మండించి వదిలివేయవద్దని, తద్వారా ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. అత్యవసర సమయంలో నంబర్ 112ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







