చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- January 24, 2026
కువైట్: కువైట్ లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లలో చలి కుంపట్లు వేసుకోవడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో జనరల్ ఫైర్ ఫోర్స్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇళ్ళు లేదా గుడారాల లోపల కోల్ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ ఫైర్ ఫోర్స్లోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గరీబ్ అల్-రాయ్ సూచించారు.
కోల్ ను మండిచడం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు విడుదల అవుతుందని, ఇది సైలంట్ కిల్లర్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా మూసివున్న ప్రాంతాలలో ఇది వేగంగా పేరుకుపోతుందని, తక్కువ సమయంలోనే స్పృహ కోల్పోయి ఊపిరాడక అపస్మారక స్థితికి చేరతారని హెచ్చరించారు.
ఇళ్ళు, గదులు లేదా మూసివున్న గుడారాల లోపల కోల్ ను ఉపయోగించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఒకవేళ దానిని ఉపయోగించాల్సి వస్తే, తగినంత వెంటిలేషన్ ఉన్న బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఉపయోగించాలని సూచించారు. రాత్రి సమయాల్లో మండించి వదిలివేయవద్దని, తద్వారా ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. అత్యవసర సమయంలో నంబర్ 112ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









