దిల్లీ నుంచి ఎవ్వరూ గుడ్గావ్కు రావొద్దని ...
- July 29, 2016
భారీ వర్షాల కారణంగా హరియాణాలోని గుడ్గావ్ నగరం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయి గత రాత్రి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు కూడా వర్షం కురుస్తుండడంతో పరిస్థితి మెరుగుపడే అవకాశం సన్నగిల్లింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. కార్లు నీటిలో మునిగిపోయాయి. దిల్లీ-గుడ్గావ్ ఎక్స్ప్రెస్ హైవే, సోహ్నా రోడ్డుపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కొన్ని గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుని ప్రజలు నానా అవస్థలు పడ్డారు.దిల్లీ నుంచి ఎవ్వరూ గుడ్గావ్కు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి కాస్త చక్కబడే వరకు పాఠశాలలు తెరవద్దని, ప్రజలు రోడ్లపైకి రావద్దని అధికారులు సూచించారు. గుడ్గావ్లోని పోలీసులందరూ ట్రాఫిక్ను నియంత్రించే పనిలోనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని గుడ్గావ్ కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్ తెలిపారు. హరియాణాలోని ఉన్నత స్థాయి అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఫొటోలను ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ రోహిత్ శర్మ కూడా జలమయమైన గుడ్గావ్ రోడ్ల ఫొటోలను ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







