దిల్లీ నుంచి ఎవ్వరూ గుడ్గావ్కు రావొద్దని ...
- July 29, 2016
భారీ వర్షాల కారణంగా హరియాణాలోని గుడ్గావ్ నగరం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయి గత రాత్రి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు కూడా వర్షం కురుస్తుండడంతో పరిస్థితి మెరుగుపడే అవకాశం సన్నగిల్లింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. కార్లు నీటిలో మునిగిపోయాయి. దిల్లీ-గుడ్గావ్ ఎక్స్ప్రెస్ హైవే, సోహ్నా రోడ్డుపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కొన్ని గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుని ప్రజలు నానా అవస్థలు పడ్డారు.దిల్లీ నుంచి ఎవ్వరూ గుడ్గావ్కు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి కాస్త చక్కబడే వరకు పాఠశాలలు తెరవద్దని, ప్రజలు రోడ్లపైకి రావద్దని అధికారులు సూచించారు. గుడ్గావ్లోని పోలీసులందరూ ట్రాఫిక్ను నియంత్రించే పనిలోనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని గుడ్గావ్ కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్ తెలిపారు. హరియాణాలోని ఉన్నత స్థాయి అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఫొటోలను ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ రోహిత్ శర్మ కూడా జలమయమైన గుడ్గావ్ రోడ్ల ఫొటోలను ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







