వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- January 28, 2026
అమెరికా: ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీయులకు నియమించుకోవడానికి హెచ్-1బీ వీసా పై అమెరికాలో మరో కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను నిలిపివేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతేడాది హెచ్-1బీ వీసా దుర్వినియోగం అవుతోందని, ప్రత్యేక నైపుణ్యం లేని ఉద్యోగాలకు వాడుతున్నారని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ఆరోపించారు. హెచ్-1బీ వీసా నియామకాలు తక్కువగా జరగాలని చెప్పారు. గురువారం ఫ్లోరిడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వ్యవస్థను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వచ్చే ఏడాది వరకు కొత్త హెచ్-1బీ నియామకాలు నిలిపివేతపై చర్చించనుంది.
ఇక హెచ్-1బీ వీసా హోల్డర్లు ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా తర్వాత టెక్సాస్ ఉంది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం, 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగం చేసేందుకు 40వేల మందికి పైగా హెచ్-1బీ వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1200 మంది పనిచేస్తున్నారు. ఇక హెచ్-1బీ వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. దీనిని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకువచ్చారు. అయితే, హెచ్-1బీ వీసా ఫీజు ఇప్పటివరకు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. 2025 సెప్టెంబర్ 19న హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ట్రంప్ ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









