అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- January 31, 2026
అయోధ్యలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ జన్మభూమి రామాలయానికి సంబంధించిన అన్ని పనులు చివరి దశకు చేరుకున్నాయి. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆలయానికి సంబంధించిన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, పరిపాలనా పనులు అన్నీ ఏప్రిల్ 30 నాటికి పూర్తవుతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ.1,900 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పటికే రూ.1,600 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.
ఆలయ నిర్మాణ బాధ్యతలను Larsen & Toubro (L&T) మరియు Tata Consultancy Services (TCS) కంపెనీలు చేపట్టాయి. మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మరో కొన్ని వారాల్లో పేపర్ వర్క్, బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాక ఆలయ నిర్వహణ పూర్తిగా ట్రస్ట్ పరిధిలోకి వెళ్లనుందని మిశ్రా తెలిపారు. భక్తుల కోసం మరింత సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







