విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- February 01, 2026
న్యూ ఢిల్లీ: విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విదేశీ యాత్రల ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్న TCS ను 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో విదేశీ విమాన ప్రయాణాలు, టూర్ ప్యాకేజీల ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. మధ్యతరగతి ప్రజలు మరియు పర్యాటక ప్రియులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
పన్ను నిబంధనలను సరళీకృతం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేత కేసుల్లో ఇప్పటి వరకు ఉన్న జైలు శిక్ష నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడానికి జరిమానాను కఠినతరం చేశారు. ఇకపై పన్ను ఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ విధించబడుతుంది. దీనివల్ల అనవసరమైన కోర్టు కేసులు తగ్గి, పన్ను వసూళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







