దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- February 01, 2026
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూఏఈ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ వెల్లడించింది. యూఏఈ బార్డర్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నప్పటికీ, యూఏఈలో భూకంప ప్రభావం అంతగా లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
యూఏఈ ప్రధాన భూకంప జోన్లో లేనప్పటికీ, ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు ప్రకంపనలు సంభవిస్తాయని పేర్కొంది. ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నందున, కొన్నిసార్లు ఎమిరేట్స్ అంతటా స్వల్ప ప్రకంపనలను ప్రజలు అనుభవిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







