దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- February 01, 2026
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూఏఈ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ వెల్లడించింది. యూఏఈ బార్డర్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నప్పటికీ, యూఏఈలో భూకంప ప్రభావం అంతగా లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
యూఏఈ ప్రధాన భూకంప జోన్లో లేనప్పటికీ, ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు ప్రకంపనలు సంభవిస్తాయని పేర్కొంది. ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నందున, కొన్నిసార్లు ఎమిరేట్స్ అంతటా స్వల్ప ప్రకంపనలను ప్రజలు అనుభవిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!









