దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- February 01, 2026
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూఏఈ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ వెల్లడించింది. యూఏఈ బార్డర్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నప్పటికీ, యూఏఈలో భూకంప ప్రభావం అంతగా లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
యూఏఈ ప్రధాన భూకంప జోన్లో లేనప్పటికీ, ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు ప్రకంపనలు సంభవిస్తాయని పేర్కొంది. ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నందున, కొన్నిసార్లు ఎమిరేట్స్ అంతటా స్వల్ప ప్రకంపనలను ప్రజలు అనుభవిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









