దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- February 01, 2026
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూఏఈ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ వెల్లడించింది. యూఏఈ బార్డర్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నప్పటికీ, యూఏఈలో భూకంప ప్రభావం అంతగా లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
యూఏఈ ప్రధాన భూకంప జోన్లో లేనప్పటికీ, ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు ప్రకంపనలు సంభవిస్తాయని పేర్కొంది. ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నందున, కొన్నిసార్లు ఎమిరేట్స్ అంతటా స్వల్ప ప్రకంపనలను ప్రజలు అనుభవిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







