ఫిబ్రవరి 11 నుంచి OTTలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’
- February 03, 2026
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమా మన శంకర వర ప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిపి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు రూ.400 కోట్ల మార్క్ ను చేరినట్లు సమాచారం.
ఈ నెల 11 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్
తెలుగు సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘మన శంకరవప్రసాద్ గారు’ రికార్డుల కెక్కింది. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కలెక్షన్లు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించింది.
అతిథి పాత్రలో విక్టరీ వెంకటేశ్ కూడా ఈ సినిమాలో కనిపించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ నెల 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. థియేటర్లలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









