ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- February 04, 2026
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్ ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ (AP) రాజధాని అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపై చర్చలు జరగనున్నాయి. ప్రజలకు వేగంగా సేవలు అందించడానికి సాంకేతికతను ఉపయోగించడం ఈ ఒప్పందం లక్ష్యం.
అమరావతి ‘క్వాంటం వ్యాలీ’లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్ గేట్స్ తో ఒప్పందం అమరావతికి మాత్రమే కాకుండా రాష్ట్రానికి పలు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుందని అంటున్నారు. బిల్ గేట్స్ అమరావతికి రానుండటంతో ఆయనకు ఏపీ వంటకాలను, ప్రభుత్వం అందించనుంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









