ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

- February 04, 2026 , by Maagulf
ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్ ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ (AP) రాజధాని అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపై చర్చలు జరగనున్నాయి. ప్రజలకు వేగంగా సేవలు అందించడానికి సాంకేతికతను ఉపయోగించడం ఈ ఒప్పందం లక్ష్యం.

అమరావతి ‘క్వాంటం వ్యాలీ’లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్ గేట్స్ తో ఒప్పందం అమరావతికి మాత్రమే కాకుండా రాష్ట్రానికి పలు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుందని అంటున్నారు. బిల్ గేట్స్ అమరావతికి రానుండటంతో ఆయనకు ఏపీ వంటకాలను, ప్రభుత్వం అందించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com