ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- February 04, 2026
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్ ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ (AP) రాజధాని అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపై చర్చలు జరగనున్నాయి. ప్రజలకు వేగంగా సేవలు అందించడానికి సాంకేతికతను ఉపయోగించడం ఈ ఒప్పందం లక్ష్యం.
అమరావతి ‘క్వాంటం వ్యాలీ’లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్ గేట్స్ తో ఒప్పందం అమరావతికి మాత్రమే కాకుండా రాష్ట్రానికి పలు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుందని అంటున్నారు. బిల్ గేట్స్ అమరావతికి రానుండటంతో ఆయనకు ఏపీ వంటకాలను, ప్రభుత్వం అందించనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!







