ఆల్-టైమ్ ఇండస్ట్రీ రీజినల్ బ్లాక్బస్టర్గా నిలిచిన 'మన శంకరవర ప్రసాద్ గారు'
- February 05, 2026
25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ ఇండస్ట్రీ రీజినల్ బ్లాక్బస్టర్గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవర ప్రసాద్ గారు'
సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ఈ చిత్రంలోని వినోదం, భావోద్వేగం, చిరంజీవి మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ కోసం థియేటర్లకు పోటెత్తుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'MSG' నాల్గవ వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి, అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఇది చిరంజీవి, అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా, ఇది బుక్మైషోలో అత్యధిక టిక్కెట్ల అమ్మకాలతో కొత్త రీజినల్ రికార్డును కూడా నెలకొల్పింది. విదేశాలలో 3.5 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువలో ఉంది.
విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన 'MSG' చిత్రం మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమౌతోంది. 400 కోట్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







