ఆల్-టైమ్ ఇండస్ట్రీ రీజినల్ బ్లాక్బస్టర్గా నిలిచిన 'మన శంకరవర ప్రసాద్ గారు'
- February 05, 2026
25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ ఇండస్ట్రీ రీజినల్ బ్లాక్బస్టర్గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవర ప్రసాద్ గారు'
సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ఈ చిత్రంలోని వినోదం, భావోద్వేగం, చిరంజీవి మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ కోసం థియేటర్లకు పోటెత్తుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'MSG' నాల్గవ వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి, అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఇది చిరంజీవి, అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా, ఇది బుక్మైషోలో అత్యధిక టిక్కెట్ల అమ్మకాలతో కొత్త రీజినల్ రికార్డును కూడా నెలకొల్పింది. విదేశాలలో 3.5 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువలో ఉంది.
విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన 'MSG' చిత్రం మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమౌతోంది. 400 కోట్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







