హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- February 06, 2026
కువైట్: కువైట్ లోని హవల్లి గవర్నరేట్లో వాణిజ్య సముదాయాలతోపాటు వినియోగదారులను ప్రభావితం చేసే ప్రకటనలపై కువైట్ మునిసిపాలిటీ అధికారులు ఫోకస్ చేశారు. మునిసిపాలిటీలోని ఆడిట్ మరియు మునిసిపల్ సర్వీసెస్ మానిటరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణాలు మరియు ప్రకటనల అనుమతుల కోసం ఆరోగ్య లైసెన్సుల చెల్లుబాటును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 65 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వారిపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని మునిసిపాటిలీ పేర్కొంది. రాబోయే వారాల్లో అన్ని గవర్నరేట్లలో అదనపు క్షేత్రస్థాయి తనిఖీలతో క్యాంపెయిన్ కొనసాగుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!









