మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- February 09, 2026
మచిలీపట్నం: మచిలీపట్నంలో షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ సౌకర్యాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం హర్షణీయమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా మచిలీపట్నం పోర్ట్కు మరిన్ని అవకాశాలు లభించి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు అవసరమైన అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పోర్ట్ అభివృద్ధి వేగవంతం కానుందని ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ చర్యలతో మచిలీపట్నం పోర్ట్ రూపురేఖలు మారి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ సౌకర్యాల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీని ద్వారా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. బందరు ప్రజల దీర్ఘకాలిక కల నెరవేరే దిశగా ఈ నిర్ణయాలు కీలకంగా నిలుస్తాయని ఆయన అన్నారు.
ఈ అంశానికి సంబంధించిన జివోను జారీ చేసి అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







