లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- February 10, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం లోక్ భవన్లో గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 11, 2026న నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సిందిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఆహ్వానించారు.
శాసనసభ సమావేశాల ప్రాధాన్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ ప్రసంగం పాత్రపై ఇరువురు చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, శాసనసభ కార్యకలాపాల సమర్థ నిర్వహణపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. స్పీకర్ ఆహ్వానాన్ని గవర్నర్ సానుకూలంగా స్వీకరించినట్లు సమాచారం.
ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల్లో సమన్వయం మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









