వాట్సాప్ వాడుతున్నారా అయితే కొంచం జాగ్రత్త వహించాలి
- July 30, 2016
కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ మెసేజింగ్ ను వాడుతున్నారా..? అయితే ఈ ప్లాట్ ఫామ్ పై సందేశాలు పంపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలంటున్నారు సెక్యురిటీ నిపుణులు. డిజిటల్ సందేశాల ప్రైవేసీ కోసం వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చినా అది కేవలం మూడో వ్యక్తి బారినుంచే కాపాడుతుందట. పూర్తిగా మెసేజ్ ల ప్రొటెక్షన్ కు ఉపయోగపడదంట. యూజర్లు డిలీట్ చేసిన మెనేజ్ లు వెంటనే తమ ఫోన్లనుంచి తొలిగిపోవని యాపిల్ ఐఓఎస్ సెక్యురిటీ నిపుణుడు జోనాథన్ ఓ సంచలన వార్తను తెలియజేశారు. స్క్రీన్ పై వెంటనే కనిపించకుండా పోయినా.. యూజర్ల స్మార్ట్ ఫోన్ లో అవి అలానే సేవ్ అయి ఉంటాయని వెల్లడించారు.
యాప్ తాజా వెర్షన్ లో డిలీట్, క్లియర్, ఆర్కైవ్ చేసిన , క్లియర్ ఆల్ చాట్స్ అన్న పర్మినెంట్ గా డిలీట్ కావని పేర్కొన్నారు. అలా చేసిన మెసేజ్ లను ఫోరెన్సిక్ ద్వారా గుర్తించి టెస్ట్ కూడా చేశామన్నారు. ఫోరెన్సిక్, రికవరీ సాప్ట్ వేర్ ద్వారా డేటాను రికవరీ చేసుకోవచ్చన్నారు. ఎస్ క్యూ లైట్ లైబ్రరీని తాజా యాప్ కోడ్ కోసం వాట్సాప్ వాడుతుందని, ఆ లైబ్రరీ వాట్సాప్ చాట్ ను పూర్తిగా డిలీట్ కాకుండా చూస్తుందన్నారు. వాట్సాప్ చాట్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే, వాట్సాప్ ను ఫోన్ నుంచి పూర్తిగా తొలగించే మార్గమమే ఉత్తమని ఆయన సూచించారు. అప్పుడైతేనే యూజర్లు డిలీట్ చేసిన చాట్స్ అన్నీ పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







