అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- February 18, 2026
న్యూ ఢిల్లీ: భారత రైల్వే శాఖ అమృత్ భారత్ స్లీపర్ రైళ్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సామాన్య ప్రయాణికుల కోసం నాన్ ఏసీ కోచ్లతో అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే, ఇప్పుడు అప్గ్రేడ్ వెర్షన్గా అమృత్ భారత్ 3.0 రైళ్లను తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బడ్జెట్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కూడా ప్రకటించగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
అమృత్ భారత్ 3.0లో కొత్త ఫీచర్లు
ప్రస్తుతం అమృత్ భారత్ 1.0, 2.0 వెర్షన్ రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. వీటిలో నాన్ ఏసీ జనరల్ మరియు స్లీపర్ కోచ్లు మాత్రమే ఉన్నాయి. అయితే త్వరలో రానున్న అమృత్ భారత్ 3.0 రైళ్లలో ఏసీ కోచ్లను కూడా జోడించనున్నారు. ఈ కొత్త వెర్షన్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు చివర్లలో లోకోమోటివ్లు ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు.
ఏప్రిల్లో ప్రారంభానికి సన్నాహాలు
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం రెండు అమృత్ భారత్ 3.0 రైళ్ల తయారీ జరుగుతోంది. రైళ్ల తయారీ పూర్తయ్యాక వాటిని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్కు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని అనుమతులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నాటికి ఈ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 50 అమృత్ భారత్ 3.0 రైళ్లను తయారు చేసే బాధ్యతను చెన్నై కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా, వాటిలో మూడు రైళ్లు తమిళనాడు నుంచి సేవలందిస్తున్నాయి.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









