అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- February 18, 2026
న్యూ ఢిల్లీ: భారత రైల్వే శాఖ అమృత్ భారత్ స్లీపర్ రైళ్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సామాన్య ప్రయాణికుల కోసం నాన్ ఏసీ కోచ్లతో అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే, ఇప్పుడు అప్గ్రేడ్ వెర్షన్గా అమృత్ భారత్ 3.0 రైళ్లను తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బడ్జెట్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కూడా ప్రకటించగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
అమృత్ భారత్ 3.0లో కొత్త ఫీచర్లు
ప్రస్తుతం అమృత్ భారత్ 1.0, 2.0 వెర్షన్ రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. వీటిలో నాన్ ఏసీ జనరల్ మరియు స్లీపర్ కోచ్లు మాత్రమే ఉన్నాయి. అయితే త్వరలో రానున్న అమృత్ భారత్ 3.0 రైళ్లలో ఏసీ కోచ్లను కూడా జోడించనున్నారు. ఈ కొత్త వెర్షన్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు చివర్లలో లోకోమోటివ్లు ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు.
ఏప్రిల్లో ప్రారంభానికి సన్నాహాలు
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం రెండు అమృత్ భారత్ 3.0 రైళ్ల తయారీ జరుగుతోంది. రైళ్ల తయారీ పూర్తయ్యాక వాటిని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్కు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని అనుమతులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నాటికి ఈ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 50 అమృత్ భారత్ 3.0 రైళ్లను తయారు చేసే బాధ్యతను చెన్నై కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా, వాటిలో మూడు రైళ్లు తమిళనాడు నుంచి సేవలందిస్తున్నాయి.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









