తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- February 18, 2026
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరుగుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. మార్చి నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మార్చి ఒకటో తేదీ నుంచి ఎండాకాలం పూర్తయ్యే వరకు అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ (Hyderabad) సిటీ ఏసీ సర్వీసుల్లో టికెట్ ఛార్జీలు 30 శాతం తగ్గించనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ జోన్లో మాత్రమే అమల్లోకి రానుంది. మెట్రో ఎక్స్ప్రెస్ ఛార్జీలకు సమానంగా ఏసీ బస్సుల్లోనూ ఛార్జీలు ఉండనున్నాయి. ఎయిర్పోర్ట్కు తిరిగే పుష్పక్ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని ఏసీ బస్సుల్లో ఈ టికెట్ తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తిరుగుతుండగా వీటిలోనే ఛార్జీల తగ్గింపును ఆర్టీసీ అధికారులు అమలుచేయనున్నారు. ఏసీ బస్సుల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని ఆశ్రయించలేకపోతున్నారు. తాజాగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రయాణికలుక ఊరట లభించనుంది. మెట్రో ఎక్స్ప్రెస్ టికెట్ ధరతోనే ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిచటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









