తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- February 18, 2026
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరుగుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. మార్చి నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మార్చి ఒకటో తేదీ నుంచి ఎండాకాలం పూర్తయ్యే వరకు అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ (Hyderabad) సిటీ ఏసీ సర్వీసుల్లో టికెట్ ఛార్జీలు 30 శాతం తగ్గించనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ జోన్లో మాత్రమే అమల్లోకి రానుంది. మెట్రో ఎక్స్ప్రెస్ ఛార్జీలకు సమానంగా ఏసీ బస్సుల్లోనూ ఛార్జీలు ఉండనున్నాయి. ఎయిర్పోర్ట్కు తిరిగే పుష్పక్ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని ఏసీ బస్సుల్లో ఈ టికెట్ తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తిరుగుతుండగా వీటిలోనే ఛార్జీల తగ్గింపును ఆర్టీసీ అధికారులు అమలుచేయనున్నారు. ఏసీ బస్సుల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని ఆశ్రయించలేకపోతున్నారు. తాజాగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రయాణికలుక ఊరట లభించనుంది. మెట్రో ఎక్స్ప్రెస్ టికెట్ ధరతోనే ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిచటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









