రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ...

- July 31, 2016 , by Maagulf
రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ...

 దిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ మైదానంలో రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దాదాపు 20వేల మంది విద్యార్థులు రియో పరుగులో పాల్గొన్నారు. ధ్యాన్‌చంద్‌ జాతీయ మైదానం నుంచి నెహ్రూ మైదానం వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 119 మంది క్రీడాకారుల బృందాన్ని రియో ఒలింపిక్స్‌కు పంపిస్తున్నామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్‌కు మరింత పెద్ద బృందాన్ని పంపుతామని వెల్లడించారు. 2020 ఒలింపిక్స్‌ క్రీడల్లో ప్రతి జిల్లా నుంచి ఒక అథ్లెట్‌ ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. భారత క్రీడాకారులు ప్రపంచ ప్రజల మనస్సులు గెలుచుకుంటారని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌గోయల్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com