భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!
- February 20, 2026
కువైట్: కువైట్ ప్రధాని భద్రతా పరమైన సంసిద్ధతపై సమీక్షించారు. పొరుగున ఉన్న ఇరాన్పై అమెరికా దాడుల సన్నాహాల నేపథ్యంలో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కువైట్ ప్రధాన మంత్రి మరియు సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ కౌన్సిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై సమీక్షించారు. మరోవైపు, కువైట్ నేషనల్ గార్డ్ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ హమద్ అల్-బర్జాస్.. కువైట్ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఈ వారాంతంలోనే ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి చర్యలకు అనుమతిస్తారా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఇరుపక్షాల మధ్య చర్చలు నిలిచిపోయినందున ఇరాన్ మరియు అమెరికా సాయుధ పోరాటం వైపు దగ్గరగా ఉన్నాయని యూఎస్ మీడియా పేర్కొంది. మరోవైపు, అరబ్ గల్ఫ్ దేశాలలోని యూఎస్ బేస్ లపై దాడి చేస్తామని ఇరాన్ పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నది.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







