భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!
- February 20, 2026
కువైట్: కువైట్ ప్రధాని భద్రతా పరమైన సంసిద్ధతపై సమీక్షించారు. పొరుగున ఉన్న ఇరాన్పై అమెరికా దాడుల సన్నాహాల నేపథ్యంలో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కువైట్ ప్రధాన మంత్రి మరియు సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ కౌన్సిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై సమీక్షించారు. మరోవైపు, కువైట్ నేషనల్ గార్డ్ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ హమద్ అల్-బర్జాస్.. కువైట్ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఈ వారాంతంలోనే ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి చర్యలకు అనుమతిస్తారా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఇరుపక్షాల మధ్య చర్చలు నిలిచిపోయినందున ఇరాన్ మరియు అమెరికా సాయుధ పోరాటం వైపు దగ్గరగా ఉన్నాయని యూఎస్ మీడియా పేర్కొంది. మరోవైపు, అరబ్ గల్ఫ్ దేశాలలోని యూఎస్ బేస్ లపై దాడి చేస్తామని ఇరాన్ పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









