భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!
- February 20, 2026
కువైట్: కువైట్ ప్రధాని భద్రతా పరమైన సంసిద్ధతపై సమీక్షించారు. పొరుగున ఉన్న ఇరాన్పై అమెరికా దాడుల సన్నాహాల నేపథ్యంలో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కువైట్ ప్రధాన మంత్రి మరియు సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ కౌన్సిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై సమీక్షించారు. మరోవైపు, కువైట్ నేషనల్ గార్డ్ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ హమద్ అల్-బర్జాస్.. కువైట్ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఈ వారాంతంలోనే ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి చర్యలకు అనుమతిస్తారా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఇరుపక్షాల మధ్య చర్చలు నిలిచిపోయినందున ఇరాన్ మరియు అమెరికా సాయుధ పోరాటం వైపు దగ్గరగా ఉన్నాయని యూఎస్ మీడియా పేర్కొంది. మరోవైపు, అరబ్ గల్ఫ్ దేశాలలోని యూఎస్ బేస్ లపై దాడి చేస్తామని ఇరాన్ పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









