శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- February 22, 2026
శ్రీశైలం: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. యాత్రికులు బస చేస్తున్న వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే గది నుంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వివరాల ప్రకారం, కాటేజీలోని గదిలో అమర్చిన ఎయిర్ కండిషనర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పొగతో పాటు మంటలు చెలరేగాయి. గదిలో ఉన్న భక్తులు పరిస్థితిని గమనించి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వారి అరుపులు విని ఇతర గదుల్లో ఉన్న యాత్రికులు కూడా అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై దేవస్థానం అధికారులు విచారణకు ఆదేశించగా, షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









