ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- February 23, 2026
ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి క్రెడిట్ కార్డ్ వాడకం మరియు ఆదాయపు పన్ను (IT) నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోంది. కార్డ్ వినియోగదారులు ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా మరియు పారదర్శకత పెంచేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి.
ఐటీ శాఖ నిఘా పెరిగే అంశాలు:
- రూ. 10 లక్షల పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ బిల్లుల రూపంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు జరిపితే, ఆ సమాచారాన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి.
- నగదు చెల్లింపులపై నిఘా: ఒకేసారి రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లుగా చెల్లిస్తే ఐటీ శాఖకు నోటీసు వెళ్తుంది.
- పాన్ కార్డు తప్పనిసరి: కొత్త క్రెడిట్ కార్డ్ పొందాలనుకునే వారు కచ్చితంగా పాన్ (PAN) కార్డును సమర్పించాలి.
వినియోగదారులకు వెసులుబాటు:
- అడ్రస్ ప్రూఫ్గా స్టేట్మెంట్: ఇకపై పాన్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను చిరునామా ధ్రువీకరణ పత్రంగా (Address Proof) వాడుకోవచ్చు.
- కార్డుతో ట్యాక్స్ పేమెంట్: క్రెడిట్ కార్డ్ ద్వారా నేరుగా ఆదాయపు పన్ను చెల్లించే సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది.
కార్పొరేట్ కార్డులపై పన్ను:
- కంపెనీ అందించిన క్రెడిట్ కార్డ్ ఖర్చులను సదరు సంస్థే భరిస్తుంటే, ఆ మొత్తాన్ని ఉద్యోగికి లభించే అదనపు ప్రయోజనంగా పరిగణిస్తారు.దీని పై నిబంధనల ప్రకారం పన్ను విధించనున్నారు.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









