‘మేడ్ ఇన్ కొరియా’ మార్చి 12న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్
- February 25, 2026
రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, రా.కార్తిక్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బా కి దక్షిణ కొరియాకు వెళ్లాలని గొప్ప కల ఉంది. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.
దర్శకుడు రా.కార్తిక్ మాట్లాడుతూ, “కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. అదే ప్రేరణతో ఈ కథను రూపొందించాను. ‘మేడ్ ఇన్ కొరియా’ హత్తుకునే స్లైస్-ఆఫ్-లైఫ్ చిత్రం. భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న కథలను ప్రోత్సహించిన నెట్ఫ్లిక్స్కు ధన్యవాదాలు,”
నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ, “దక్షిణాది కథలపై మా దృష్టిని మరింత బలోపేతం చేస్తూ, స్థానిక సంస్కృతిలో నాటుకుపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను తాకే కథలను తీసుకురావడమే మా లక్ష్యం. తమిళనాడులోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి కలల కథగా ‘మేడ్ ఇన్ కొరియా’ను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ప్రియాంక మోహన్ నటిస్తూ, శెన్బా భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ దక్షిణ కొరియా నటుడు పార్క్ హ్యే-జిన్తో పాటు నో హో-జిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తన పాత్ర గురించి ప్రియాంక మోహన్ మాట్లాడుతూ, “శెన్బా కలలు ఆశ్చర్యం, ఆసక్తి నుంచి పుట్టినవి. కథ మొదట వినగానే నాకు ఆ పాత్రతో బలమైన అనుబంధం ఏర్పడింది. నెట్ఫ్లిక్స్ చిత్రంలో భాగం కావడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది.
మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్ఫ్లిక్స్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
తారాగణం: ప్రియాంక మోహన్, పార్క్ హై-జిన్
దర్శకత్వం: రా.కార్తీక్
రచయిత: రా.కార్తీక్
నిర్మాత: శ్రీనిధి సాగర్
నిర్మాణం: రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









