ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
- February 28, 2026
ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు, అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో టచ్లో ఉన్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రధాన సూచనలు..
ఇజ్రాయెల్ అధికారులు, ‘హోమ్ ఫ్రంట్ కమాండ్’ జారీ చేసే భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తప్పనిసరిగా పాటించాలి.
నివాస ప్రాంతాల్లో లేదా కార్యాలయాల వద్ద ఉన్న రక్షణ కేంద్రాలు, సురక్షిత గదుల గురించి ముందే తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో వెంటనే అక్కడికి చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
ఇజ్రాయెల్ దేశం లోపల అత్యవసరం కాని ప్రయాణాలను ప్రస్తుతానికి పూర్తిగా వాయిదా వేసుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన
- ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
- ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!









