‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన
- February 28, 2026
తమ భూభాగం పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులపై ఇరాన్ నిప్పులు చెరిగింది. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన సమయంలో గట్టి బుద్ధి చెబుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఈ పరిణామాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సమాజానికి కీలక సంకేతాలు పంపారు. ఈ హెచ్చరికలతో మధ్యప్రాచ్య (Middle East) ప్రాంతంలో యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
‘యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, మేం ముగింపు పలుకుతాం. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుంది’ అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ యొక్క దృఢమైన వైఖరిని తెలియజేస్తున్నాయి, ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇరాన్ తన ప్రతిస్పందన ద్వారా ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపనుంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.. ఏకంగా ఖమేని కార్యాలయం దగ్గరలో క్షిపణి దాడి జరిగింది. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, ఆఫీసు సమీపంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే దాడులకు ముందే ఖమేని బంకర్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందన్నారు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నామన్నారు ట్రంప్.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







