అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- February 28, 2026
యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నావికాదళం 5వ ఫ్లీట్ ముఖ్య కార్యాలయంపై మిస్సైల్ దాడి జరగ్గా, కువైట్లోని అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్, యూఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్లపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.మనామా, అబుధాబీ నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు, ఇజ్రాయెల్ వైపు కూడా తాము మిస్సైల్, డ్రోన్ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించింది.
ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ‘మేజర్ కంబాట్ ఆపరేషన్స్’ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, మిస్సైల్ పరిశ్రమను పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇరాన్ ప్రజలు తమ పాలకులను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్రస్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాలు తమ వాయు రవాణా ప్రాంతాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర స్థితి కొనసాగుతోంది.
ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగంపై తమ మిస్సైల్ దాడులను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా అడ్డుకుంటోంది. అదే సమయంలో, ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వెలువడ్డాయి. టెహ్రాన్ సమీపంలో ఉన్న సుప్రీం లీడర్ కార్యాలయాల వద్ద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీనిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు మరింత కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటామని ఘాటుగా హెచ్చరించింది. కాగా, ఈ సైనిక చర్యలను అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) పేరుతో నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







