అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- February 28, 2026
యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నావికాదళం 5వ ఫ్లీట్ ముఖ్య కార్యాలయంపై మిస్సైల్ దాడి జరగ్గా, కువైట్లోని అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్, యూఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్లపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.మనామా, అబుధాబీ నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు, ఇజ్రాయెల్ వైపు కూడా తాము మిస్సైల్, డ్రోన్ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించింది.
ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ‘మేజర్ కంబాట్ ఆపరేషన్స్’ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, మిస్సైల్ పరిశ్రమను పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇరాన్ ప్రజలు తమ పాలకులను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్రస్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాలు తమ వాయు రవాణా ప్రాంతాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర స్థితి కొనసాగుతోంది.
ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగంపై తమ మిస్సైల్ దాడులను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా అడ్డుకుంటోంది. అదే సమయంలో, ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వెలువడ్డాయి. టెహ్రాన్ సమీపంలో ఉన్న సుప్రీం లీడర్ కార్యాలయాల వద్ద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీనిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు మరింత కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటామని ఘాటుగా హెచ్చరించింది. కాగా, ఈ సైనిక చర్యలను అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) పేరుతో నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









