విమానయాన ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు: GCAA
- March 01, 2026
అబుదాబి: ఎయిర్ స్పేస్ మూసివేయడం కారణంగా విమానయాన రంగం షట్ డౌన్ అయిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) తెలిపింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను నియంత్రించడానికి కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఫ్లైట్ షెడ్యూళ్లను క్రమంగా తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
దేశంలోని విమానాశ్రయాలు మరియు జాతీయ క్యారియర్లు సమన్వయంతో పనిచేస్తున్నాయని అథారిటీ పేర్కొంది. దేశంలోని విమానాశ్రయాల మధ్య కొన్ని విమానాలను నడపడం, రీషెడ్యూలింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడం మరియు ప్రయాణికుల రద్దీని పరిష్కరించడానికి ప్రయాణీకుల టెర్మినల్లలో ఆన్-గ్రౌండ్ సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటివి తమ కార్యచరణ ప్రణాళికలో ఉన్నాయని అథారిటీ తెలిపింది.
చిక్కుకుపోయిన ప్రయాణీకులకు అన్ని రకాల హోస్టింగ్ మరియు వసతి ఖర్చులను స్టేట్ భరిస్తుందని GCAA ప్రకటించింది. దేశంలోని విమానాశ్రయాలు మరియు జాతీయ విమానయాన సంస్థలు కొన్ని విమానాల రీషెడ్యూల్ ద్వారా ప్రభావితమైన సుమారు 20,200 మంది ప్రయాణికులకు తగిన సేవలు అందించినట్లు తెలిపింది. రీబుకింగ్ విధానాలను సులభతరం చేయడంతో పాటు, భోజనం మరియు రిఫ్రెష్మెంట్లతో పాటు తాత్కాలిక వసతిని అందిస్తున్నట్లు వెల్లడించింది. మరింత సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని GCAA ప్రయాణికులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









