విమానయాన ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు: GCAA
- March 01, 2026
అబుదాబి: ఎయిర్ స్పేస్ మూసివేయడం కారణంగా విమానయాన రంగం షట్ డౌన్ అయిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) తెలిపింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను నియంత్రించడానికి కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఫ్లైట్ షెడ్యూళ్లను క్రమంగా తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
దేశంలోని విమానాశ్రయాలు మరియు జాతీయ క్యారియర్లు సమన్వయంతో పనిచేస్తున్నాయని అథారిటీ పేర్కొంది. దేశంలోని విమానాశ్రయాల మధ్య కొన్ని విమానాలను నడపడం, రీషెడ్యూలింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడం మరియు ప్రయాణికుల రద్దీని పరిష్కరించడానికి ప్రయాణీకుల టెర్మినల్లలో ఆన్-గ్రౌండ్ సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటివి తమ కార్యచరణ ప్రణాళికలో ఉన్నాయని అథారిటీ తెలిపింది.
చిక్కుకుపోయిన ప్రయాణీకులకు అన్ని రకాల హోస్టింగ్ మరియు వసతి ఖర్చులను స్టేట్ భరిస్తుందని GCAA ప్రకటించింది. దేశంలోని విమానాశ్రయాలు మరియు జాతీయ విమానయాన సంస్థలు కొన్ని విమానాల రీషెడ్యూల్ ద్వారా ప్రభావితమైన సుమారు 20,200 మంది ప్రయాణికులకు తగిన సేవలు అందించినట్లు తెలిపింది. రీబుకింగ్ విధానాలను సులభతరం చేయడంతో పాటు, భోజనం మరియు రిఫ్రెష్మెంట్లతో పాటు తాత్కాలిక వసతిని అందిస్తున్నట్లు వెల్లడించింది. మరింత సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని GCAA ప్రయాణికులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









