శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- March 01, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్త దావానంలా వ్యాపించడంతో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.ఈ వార్త తెలియగానే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. తమ ఆధ్యాత్మిక నాయకుడిని కోల్పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
శ్రీనగర్ వీధుల్లో అలీ ఖమేనీ చిత్రపటాలను, నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్పై జరిగిన దాడులను, ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన నిరసనకారులు..తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కొన్ని చోట్ల టైర్లు తగులబెట్టి రోడ్లను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జమ్మూకశ్మీర్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు









