ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- March 01, 2026
ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భారీ వైమానిక దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతున్న వేళ, ఆ దేశ సుప్రీం నాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గడ్డ పై అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగంగా గుర్తింపు పొందిన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) కు కొత్త కమాండర్-ఇన్-చీఫ్ను నియమించింది. సీనియర్ అధికారి బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీని ఈ అత్యున్నత పదవిలో నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శనివారం జరిగిన దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మహ్మద్ పాక్పూర్ మరణించినట్లు వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.అహ్మద్ వాహిదీకి సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన ఇరాన్ రక్షణ మంత్రిగా, అంతర్గత వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో, వ్యూహరచనలో నిపుణుడైన వాహిదీ నియామకం ద్వారా సైనిక బలగాల్లో ఐక్యతను తీసుకురావాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!









