ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- March 01, 2026
ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భారీ వైమానిక దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతున్న వేళ, ఆ దేశ సుప్రీం నాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గడ్డ పై అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగంగా గుర్తింపు పొందిన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) కు కొత్త కమాండర్-ఇన్-చీఫ్ను నియమించింది. సీనియర్ అధికారి బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీని ఈ అత్యున్నత పదవిలో నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శనివారం జరిగిన దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మహ్మద్ పాక్పూర్ మరణించినట్లు వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.అహ్మద్ వాహిదీకి సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన ఇరాన్ రక్షణ మంత్రిగా, అంతర్గత వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో, వ్యూహరచనలో నిపుణుడైన వాహిదీ నియామకం ద్వారా సైనిక బలగాల్లో ఐక్యతను తీసుకురావాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









