శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- March 01, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్త దావానంలా వ్యాపించడంతో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.ఈ వార్త తెలియగానే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. తమ ఆధ్యాత్మిక నాయకుడిని కోల్పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
శ్రీనగర్ వీధుల్లో అలీ ఖమేనీ చిత్రపటాలను, నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్పై జరిగిన దాడులను, ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన నిరసనకారులు..తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కొన్ని చోట్ల టైర్లు తగులబెట్టి రోడ్లను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జమ్మూకశ్మీర్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









