ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- March 01, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకు సీఎస్గా విధులు నిర్వహించిన విజయానంద్ అదే రోజు ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ నియమితులు అయ్యారు.
కొత్త ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కి సచివాలయంలోని ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు శుభాకాంక్షలను వెల్లడించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, ఎంటీ కృష్ణ బాబు, ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులుకాంతిలాల్ దండే, ముఖేశ్ కుమార్ మీనా తదితరులు విషెస్ అందించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా మర్యాద పూర్వకంగా కలిసి అభినందలు చెప్పారు. అలాగే 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ సహా పలు కార్పొరేషన్ ఛైర్మన్లు కొత్త సీఎస్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









