ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- March 01, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకు సీఎస్గా విధులు నిర్వహించిన విజయానంద్ అదే రోజు ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ నియమితులు అయ్యారు.
కొత్త ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కి సచివాలయంలోని ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు శుభాకాంక్షలను వెల్లడించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, ఎంటీ కృష్ణ బాబు, ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులుకాంతిలాల్ దండే, ముఖేశ్ కుమార్ మీనా తదితరులు విషెస్ అందించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా మర్యాద పూర్వకంగా కలిసి అభినందలు చెప్పారు. అలాగే 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ సహా పలు కార్పొరేషన్ ఛైర్మన్లు కొత్త సీఎస్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









