ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..

- March 01, 2026 , by Maagulf
ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకు సీఎస్‌గా విధులు నిర్వహించిన విజయానంద్ అదే రోజు ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ నియమితులు అయ్యారు.

కొత్త ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కి సచివాలయంలోని ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు శుభాకాంక్షలను వెల్లడించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎస్ రావత్, ఎంటీ కృష్ణ బాబు, ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులుకాంతిలాల్ దండే, ముఖేశ్ కుమార్ మీనా తదితరులు విషెస్ అందించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా మర్యాద పూర్వకంగా కలిసి అభినందలు చెప్పారు. అలాగే 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ సహా పలు కార్పొరేషన్ ఛైర్మన్లు కొత్త సీఎస్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com