మాతృభాషలో ఈ-మెయిల్ ఐడీ క్రియేట్,,,
- July 31, 2016
మాతృభాషలో ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవడం మీ కోరికనా..? అయితే నచ్చిన భాషలోనే ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునే అవకాశం యూజర్ల ముందుకు రాబోతుందట. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాప్ట్ లు, రీడిఫ్ లాంటి దేశీయ ఈ-మెయిల్ సంస్థలు నచ్చిన భాషలో ఈమెయిల్ క్రియేట్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నాయట. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ-మెయిల్ సర్వీసు ప్రొవేడర్లు ఈ మేరకు సేవలు అందించేందుకు సమ్మతించారు. గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్ లతో ప్రభుత్వం గత నెలలో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో దేశీ ఈ-మెయిల్ అడ్రస్ లను యూజర్లకు అందుబాటులోకి తేవాలని, హిందీ లాంగ్వేజ్ తో ఈ సర్వీసులను అందించాలని ప్రభుత్వం కోరింది. దీంతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్ ను మరింత దగ్గర చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కొన్నేళ్లలో భారత్ నెట్ ప్రాజెక్టు కింద 250,000 గ్రామ పంచాయితీలను హైస్పీడ్ ఇంటెర్నెట్ కు కనెక్ట్ చేయనున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్ తెలిపారు. వారికి అనువైన రీతిలో ఇంటర్నెట్ సేవలు కల్పిస్తే ప్రజలు సులభతరంగా దీన్ని యాక్సెస్ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ను కూడా పెంచవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం







