ఆప్ఘనిస్తాన్ రాజధాని లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం..

- July 31, 2016 , by Maagulf
ఆప్ఘనిస్తాన్ రాజధాని  లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం..

 ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని పూల్-ఏ-చర్కి ప్రాంతంలోని ఫారెన్ గెస్ట్ హౌస్ నార్త్ గేట్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఆదివారం అర్థరాత్రి తరువాత జరిగిన ఈ శక్తివంతమైన బాంబు పేలుడు.. కాబూల్ మొత్తం వినిపించిందని స్థానికులు మీడియాతో వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామే నంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేటుడు పదార్ధాలతో నిండిన ట్రక్కును పేల్చేసిన అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.కాబూల్ లో గత వారం ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 80 మంది మృతి చెందగా.. 230 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com