ఆప్ఘనిస్తాన్ రాజధాని లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం..
- July 31, 2016
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని పూల్-ఏ-చర్కి ప్రాంతంలోని ఫారెన్ గెస్ట్ హౌస్ నార్త్ గేట్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఆదివారం అర్థరాత్రి తరువాత జరిగిన ఈ శక్తివంతమైన బాంబు పేలుడు.. కాబూల్ మొత్తం వినిపించిందని స్థానికులు మీడియాతో వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామే నంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేటుడు పదార్ధాలతో నిండిన ట్రక్కును పేల్చేసిన అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.కాబూల్ లో గత వారం ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 80 మంది మృతి చెందగా.. 230 మంది గాయపడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- Foreign tourist spending in Korea hits record US$911 million
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!







