నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- March 02, 2026
దుబాయ్: దుబాయ్: “దుబాయ్ క్రైసిస్ మేనేజ్మెంట్” విభాగానికి చెందినవారమని చెప్పుకుంటూ, దుబాయ్ పోలీసులతో సంబంధం ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ మోసగాళ్లు ప్రజలను సంప్రదిస్తున్నారని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.
ప్రస్తుత పరిణామాలను ఆసరాగా చేసుకుని, వ్యక్తులను ఫోన్ ద్వారా సంప్రదిస్తూ UAE పాస్ లాగిన్ వివరాలు, ఎమిరేట్స్ ఐడీ సమాచారం వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను కోరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వివరాలను పంచుకుంటే మోసగాళ్లు సిమ్-స్వాప్ మోసాలకు పాల్పడి, మొబైల్ బ్యాంకింగ్ యాప్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి అనధికారికంగా ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఏ పరిస్థితుల్లోనూ అధికారిక సంస్థలు ఫోన్ కాల్స్ లేదా సందేశాల ద్వారా పాస్వర్డ్లు, ధృవీకరణ కోడ్లు లేదా గోప్యమైన వివరాలను అడగవని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు.
నివాసితులు ధృవీకరించని కాలర్లకు వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం ఇవ్వవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మోసాలను వెంటనే అధికారిక మార్గాల ద్వారా 901 నంబర్కు కాల్ చేసి లేదా సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన eCrime ప్లాట్ఫారమ్ ద్వారా నివేదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక









