నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- March 02, 2026
దుబాయ్: దుబాయ్: “దుబాయ్ క్రైసిస్ మేనేజ్మెంట్” విభాగానికి చెందినవారమని చెప్పుకుంటూ, దుబాయ్ పోలీసులతో సంబంధం ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ మోసగాళ్లు ప్రజలను సంప్రదిస్తున్నారని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.
ప్రస్తుత పరిణామాలను ఆసరాగా చేసుకుని, వ్యక్తులను ఫోన్ ద్వారా సంప్రదిస్తూ UAE పాస్ లాగిన్ వివరాలు, ఎమిరేట్స్ ఐడీ సమాచారం వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను కోరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వివరాలను పంచుకుంటే మోసగాళ్లు సిమ్-స్వాప్ మోసాలకు పాల్పడి, మొబైల్ బ్యాంకింగ్ యాప్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి అనధికారికంగా ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఏ పరిస్థితుల్లోనూ అధికారిక సంస్థలు ఫోన్ కాల్స్ లేదా సందేశాల ద్వారా పాస్వర్డ్లు, ధృవీకరణ కోడ్లు లేదా గోప్యమైన వివరాలను అడగవని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు.
నివాసితులు ధృవీకరించని కాలర్లకు వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం ఇవ్వవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మోసాలను వెంటనే అధికారిక మార్గాల ద్వారా 901 నంబర్కు కాల్ చేసి లేదా సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన eCrime ప్లాట్ఫారమ్ ద్వారా నివేదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







