బహ్రెయిన్‌: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

- March 02, 2026 , by Maagulf
బహ్రెయిన్‌: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

మనామా: అడ్డగించిన క్షిపణి నుంచి పడిన అవశేషాల కారణంగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, సల్మాన్ ఇండస్ట్రియల్ సిటీలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఒక విదేశీ నౌకపై క్షిపణి అవశేషాలు పడటంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపింది.ఈ ఘటనలో ఒక ఆసియా దేశానికి చెందిన కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.

అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com