ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- March 02, 2026
హైదరాబాద్: ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు గుమిగూడి తమ సంతాపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్ల జెండాలు చేతబూని, మతపరమైన నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనల దృష్ట్యా పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన లక్నో, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, జమ్మూ-కశ్మీర్ మరియు శ్రీనగర్లలో కూడా నిరసనలు మిన్నంటాయి. షియా వర్గీయులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ మృతి తమ వర్గానికి తీరని లోటని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమేనీ మృతి నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఆంక్షలు విధించింది. చేతుల్లో నల్ల జెండాలు పట్టుకుని, నలుపు రంగు దుస్తులు ధరించి మౌన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తోంది. అధికారులు ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









