ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- March 02, 2026
హైదరాబాద్: ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు గుమిగూడి తమ సంతాపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్ల జెండాలు చేతబూని, మతపరమైన నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనల దృష్ట్యా పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన లక్నో, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, జమ్మూ-కశ్మీర్ మరియు శ్రీనగర్లలో కూడా నిరసనలు మిన్నంటాయి. షియా వర్గీయులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ మృతి తమ వర్గానికి తీరని లోటని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమేనీ మృతి నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఆంక్షలు విధించింది. చేతుల్లో నల్ల జెండాలు పట్టుకుని, నలుపు రంగు దుస్తులు ధరించి మౌన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తోంది. అధికారులు ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







