ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- March 02, 2026
హైదరాబాద్: ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు గుమిగూడి తమ సంతాపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్ల జెండాలు చేతబూని, మతపరమైన నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనల దృష్ట్యా పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన లక్నో, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, జమ్మూ-కశ్మీర్ మరియు శ్రీనగర్లలో కూడా నిరసనలు మిన్నంటాయి. షియా వర్గీయులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ మృతి తమ వర్గానికి తీరని లోటని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమేనీ మృతి నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఆంక్షలు విధించింది. చేతుల్లో నల్ల జెండాలు పట్టుకుని, నలుపు రంగు దుస్తులు ధరించి మౌన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తోంది. అధికారులు ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









