ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- March 02, 2026
హైదరాబాద్: ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు గుమిగూడి తమ సంతాపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్ల జెండాలు చేతబూని, మతపరమైన నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనల దృష్ట్యా పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన లక్నో, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, జమ్మూ-కశ్మీర్ మరియు శ్రీనగర్లలో కూడా నిరసనలు మిన్నంటాయి. షియా వర్గీయులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ మృతి తమ వర్గానికి తీరని లోటని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమేనీ మృతి నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఆంక్షలు విధించింది. చేతుల్లో నల్ల జెండాలు పట్టుకుని, నలుపు రంగు దుస్తులు ధరించి మౌన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తోంది. అధికారులు ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!
- యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- ఖతార్ బ్యాంకుల మొత్తం ఆస్తులు QR 2.173 ట్రిలియన్లు..!!
- బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!
- ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!









