మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాలు ఖాళీ చేయండి!
- August 01, 2016
ఉత్తరప్రదేశ్లోని మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాల్లో ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది. అలా ఉంటున్న వారు రెండు నెలల్లోగా బంగ్లాలు ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాల్సి ఉంది.
2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న.. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనతో యూపీ మాజీ ముఖ్యమంత్రులు కల్యాణ్ సింగ్, ఎన్డీ తివారీ కూడా అధికారిక బంగ్లాలు వీడాల్సి ఉంది. మాజీ సీఎంలు అధికారిక బంగ్లాల్లోనే ఉండడాన్ని వ్యతిరేకిస్తూ లఖ్నవూకు చెందిన ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







