మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాలు ఖాళీ చేయండి!

- August 01, 2016 , by Maagulf
మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాలు ఖాళీ చేయండి!

 ఉత్తరప్రదేశ్‌లోని మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాల్లో ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది. అలా ఉంటున్న వారు రెండు నెలల్లోగా బంగ్లాలు ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులైన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌, బీఎస్పీ చీఫ్‌ మాయావతిలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాల్సి ఉంది.
2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న.. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనతో యూపీ మాజీ ముఖ్యమంత్రులు కల్యాణ్‌ సింగ్‌, ఎన్డీ తివారీ కూడా అధికారిక బంగ్లాలు వీడాల్సి ఉంది. మాజీ సీఎంలు అధికారిక బంగ్లాల్లోనే ఉండడాన్ని వ్యతిరేకిస్తూ లఖ్‌నవూకు చెందిన ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com