భారతీయ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామనీ సుష్మాస్వరాజ్..
- August 01, 2016
సౌదీ అరేబియాలో ఉన్న భారతీయ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామనీ, వారికి పరిహారం అందించేందుకు కృషి చేస్తామనీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు.
సోమవారం పార్లమెంటు సమావేశంలో అమె మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం సౌదీకి వెళ్లి అక్కడ ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో, ఆకలితో బాధపడుతున్న వేలమందికి భారత కాన్సులేట్, జెడ్డాలో ఆహారాన్ని అందిస్తోందని చెప్పారు. గత కొన్ని నెలలుగా జీతాలు అందుకోని ఉద్యోగులందరికీ వారికి దక్కాల్సిన మొత్తం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ వచ్చే వారం సౌదీ అరేబియాకు వెళ్లి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న భారతీయ కార్మికులకు సాయం చేయనున్నట్లు ఆమె తెలిపారు.చమురు ధరల పతనంతో ఏడాది కాలంగా అక్కడి ప్రభుత్వం ఖర్చుపై కోత వేసింది. దీంతో ప్రభుత్వ కాంట్రాక్టులపై ఆధారపడి నిర్మాణ కార్యకలాపాల్ని కొనసాగించే సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ కారణంగా సౌదీ అరేబియాలోని పలు ఫ్యాక్టరీలు గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతభత్యాలను ఇవ్వలేకపోతున్నాయని సుష్మా వివరించారు. ఈ కారణంగానే సుమారు పదివేల మంది ఆహారం కూడా లభించక ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







