భారతీయ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామనీ సుష్మాస్వరాజ్..
- August 01, 2016
సౌదీ అరేబియాలో ఉన్న భారతీయ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామనీ, వారికి పరిహారం అందించేందుకు కృషి చేస్తామనీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు.
సోమవారం పార్లమెంటు సమావేశంలో అమె మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం సౌదీకి వెళ్లి అక్కడ ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో, ఆకలితో బాధపడుతున్న వేలమందికి భారత కాన్సులేట్, జెడ్డాలో ఆహారాన్ని అందిస్తోందని చెప్పారు. గత కొన్ని నెలలుగా జీతాలు అందుకోని ఉద్యోగులందరికీ వారికి దక్కాల్సిన మొత్తం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ వచ్చే వారం సౌదీ అరేబియాకు వెళ్లి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న భారతీయ కార్మికులకు సాయం చేయనున్నట్లు ఆమె తెలిపారు.చమురు ధరల పతనంతో ఏడాది కాలంగా అక్కడి ప్రభుత్వం ఖర్చుపై కోత వేసింది. దీంతో ప్రభుత్వ కాంట్రాక్టులపై ఆధారపడి నిర్మాణ కార్యకలాపాల్ని కొనసాగించే సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ కారణంగా సౌదీ అరేబియాలోని పలు ఫ్యాక్టరీలు గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతభత్యాలను ఇవ్వలేకపోతున్నాయని సుష్మా వివరించారు. ఈ కారణంగానే సుమారు పదివేల మంది ఆహారం కూడా లభించక ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







