సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!

- March 07, 2026 , by Maagulf
సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!

మనామా: బహ్రెయిన్ లోని సివిల్ డిఫెన్స్ బృందాలు గత కొన్ని రోజులుగా డ్రోన్ దాడులు, మంటలు మరియు భవనాలు, వాహనాలపై శికలాలు పడటం వంటి సంఘటనలతో సహా దాదాపు 90 అత్యవసర రిపోర్టులపై పనిచేసాయి. 

ప్రస్తుత పరిణామాలను పరిష్కరించడానికి మరియు ప్రజా భద్రతను నిర్ధారించడానికి అధికారులు తీసుకున్న చర్యలను హైలైట్ చేస్తూ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి కెప్టెన్ అబ్దుల్లా వహీద్ అల్ మన్నాయ్ బ్రీఫింగ్ ఇచ్చారు.

అధికారుల కథనం ప్రకారం, క్యాపిటల్ గవర్నరేట్‌లోని ఒక హోటల్ మరియు రెండు నివాస భవనాలను లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగాయి. ఇందులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సివిల్ డిఫెన్స్ బృందాలు ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి.

సముద్ర భద్రతను పెంచడానికి కోస్ట్ గార్డ్ కార్యాచరణ సంసిద్ధతను పెంచింది.  సముద్ర గస్తీని ముమ్మరం చేసింది.  

అనేక సైబర్ దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు మరియు జాతీయ డిజిటల్ వ్యవస్థల రక్షణను బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు.

వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య ప్రయత్నాలను సమన్వయం చేయడానికి మరియు ఏదైనా అత్యవసర పరిస్థితికి వేగవంతమైన ప్రతిస్పందనను నిర్ధారించడానికి నేషనల్ సివిల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను యాక్టివేట్ చేసినట్లు కెప్టెన్ అల్ మన్నాయ్ వివరించారు.

అనేక ప్రదేశాలలో మంటలు మరియు శికలాలు పడిన సంఘనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు పరిస్థితులను నియంత్రించడానికి మరియు మరింత నష్టాన్ని నివారించడానికి వేగంగా పనిచేశాయని, బహ్రెయిన్ అత్యవసర సేవల సామర్థ్యం మరియు సంసిద్ధతను ప్రదర్శించాయని ప్రశంసలు కురిపించారు.

బహ్రెయిన్ అంతటా 33 అత్యవసర షెల్టర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు, 13 షెల్ర్లను మాత్రమే యాక్టివేట్ చేశామని, ప్రస్తుం 10 లో మాత్రమే వసతి, వైద్య సహాయం మరియు ప్రాథమిక అవసరాలతో సహా అవసరమైన సేవలను అందింస్తున్నట్లు తెలిపారు. 

ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా విద్యా సంస్థలు తాత్కాలికంగా డిస్టెన్స్ లెర్నింగ్ కు మారాయని అన్నారు.  దీని వలన విద్యార్థులు ఇంటి నుండి సురక్షితంగా తమ చదువులను కొనసాగిస్తున్నారని తెలిపారు. అలాగే, అనేక ప్రభుత్వ సంస్థలు రిమోట్ వర్కింగ్ ను అమలు చేస్తున్నాయని, ప్రస్తుతం దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు రిమోట్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

వాటర్, విద్యుత్, ఆరోగ్య సంరక్షణ మరియు ఆహార సరఫరాలతో సహా అవసరమైన సేవలు సాధారణంగా పనిచేస్తూనే ఉన్నాయని ఆయన వివరించారు.

బహ్రెయిన్ గగనతలంలో ముప్పు తలెత్తిన సమయంలో పౌరులు మరియు నివాసితులను రక్షించడానికి రూపొందించిన జాతీయ అలారం వ్యవస్థ యాక్టివ్ గా ఉందని తెలిపారు.

బహ్రెయిన్ గగనతలం వెలుపల ఇరానియన్ విమానాలు లేదా డ్రోన్‌లను అడ్డగించడం వల్ల కొన్ని పేలుడు శబ్దాలు సంభవించవచ్చని అని అల్ మన్నాయ్ అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌరులు మరియు నివాసితులు అధికారిక మార్గదర్శకాలను పాటించాలని కోరారు.  పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని మరియు ఖచ్చితమైన సమాచారం కోసం విశ్వసనీయ వనరులపై మాత్రమే ఆధారపడాలని అల్ మన్నాయ్ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com