కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- March 07, 2026
కువైట్: ఆన్ లైన్ లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడ్డ 13 మందిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు సోషల్ మీడియాలో వేదికగా సమాజానికి హాని కలిగించేలా వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. విచారణ అనంతరం 13 మంది నిందితులను ముందస్తు నిర్బంధంలో ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిందని పేర్కొన్నారు.
నిందితులు మతపరమైన కలహాలు, హింసను ప్రేరేపించడం మరియు జాతీయ ఐక్యతను బలహీనపరిచే మరియు సామాజిక ఐక్యతను దెబ్బతీసే, సమాజంలో విభజనకు కారణమయ్యే విషయాలను వ్యాప్తి చేసినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
నిందితులు ప్రజలలో భయాందోళనలను రేకెత్తించే మరియు సాయుధ దళాల రక్షణ సంసిద్ధతను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా కంటెంట్ ను రూపొందించి వైరల్ చేస్తున్నారని తెలిపింది. జాతీయ భద్రత, ఐక్యత మరియు సమాజానికి ముప్పు కలిగేలా నిందితులు ప్రయత్నించారని విచారణలో అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.
అటార్నీ జనరల్ సాద్ అల్-సఫ్రాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో దర్యాప్తు జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ప్రకటనలో తెలిపింది. ఆయన అనేక ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, వివిధ కోణాల్లో విచారణ చేయించారని వెల్లడించింది.
డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించే క్రమంలో బాధ్యతను ఉండాలని, భయాందోళనలను రేకెత్తించే, జాతీయ సంకల్పాన్ని బలహీనపరిచే లేదా సాయుధ దళాల రక్షణ సంసిద్ధతకు హాని కలిగించే పుకార్లు, తప్పుదారి పట్టించే వార్తలు లేదా కంటెంట్ను వ్యాప్తి చేయకుండా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









