దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- March 07, 2026
దోహా : ఖతార్ వైమానిక ప్రాంతం మూసివేత కారణంగా షెడ్యూల్ చేసిన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఖతార్ వైమానిక ప్రాంతాన్ని సురక్షితంగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతనే తమ సంస్థ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఎయిర్లైన్ తెలిపింది.
మార్చి 8న ఉదయం 9 గంటలకు (06:00 UTC) తాజా అప్డేట్ లను ప్రకటిస్తామని X లో ఒక ప్రకటనలో ఎయిర్లైన్ తెలిపింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సురక్షితమైన ఆపరేటింగ్ కారిడార్ను నిర్ధారించిన తర్వాత, ఖతార్ ఎయిర్వేస్ మార్చి 8న లండన్, పారిస్, మాడ్రిడ్, రోమ్, ఫ్రాంక్ఫర్ట్ మరియు బ్యాంకాక్ నుండి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను నడపాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ విమానాలు తుది గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణీకులకు మాత్రమే అని స్పష్టం చేసింది. దోహాలో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య కార్యకలాపాల పునఃప్రారంభానికి నిర్ధారణ కాదని పేర్కొంది.
ప్రయాణికులు తాజా ప్రయాణానికి సంబంధించి ధృవీకరించబడిన టికెట్ ఉంటనే విమానాశ్రయానికి రావాలని ఖతార్ ఎయిర్వేస్ సూచించింది. మరింత సమాచారం, లేదా తాజా అప్డేట్ ల కోసం ఖతార్ ఎయిర్వేస్ అధికారిక ఛానల్స్ ను ఫాలో కావాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







