దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- March 07, 2026
దోహా : ఖతార్ వైమానిక ప్రాంతం మూసివేత కారణంగా షెడ్యూల్ చేసిన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఖతార్ వైమానిక ప్రాంతాన్ని సురక్షితంగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతనే తమ సంస్థ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఎయిర్లైన్ తెలిపింది.
మార్చి 8న ఉదయం 9 గంటలకు (06:00 UTC) తాజా అప్డేట్ లను ప్రకటిస్తామని X లో ఒక ప్రకటనలో ఎయిర్లైన్ తెలిపింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సురక్షితమైన ఆపరేటింగ్ కారిడార్ను నిర్ధారించిన తర్వాత, ఖతార్ ఎయిర్వేస్ మార్చి 8న లండన్, పారిస్, మాడ్రిడ్, రోమ్, ఫ్రాంక్ఫర్ట్ మరియు బ్యాంకాక్ నుండి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను నడపాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ విమానాలు తుది గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణీకులకు మాత్రమే అని స్పష్టం చేసింది. దోహాలో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య కార్యకలాపాల పునఃప్రారంభానికి నిర్ధారణ కాదని పేర్కొంది.
ప్రయాణికులు తాజా ప్రయాణానికి సంబంధించి ధృవీకరించబడిన టికెట్ ఉంటనే విమానాశ్రయానికి రావాలని ఖతార్ ఎయిర్వేస్ సూచించింది. మరింత సమాచారం, లేదా తాజా అప్డేట్ ల కోసం ఖతార్ ఎయిర్వేస్ అధికారిక ఛానల్స్ ను ఫాలో కావాలని కోరింది.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









