దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- March 07, 2026
దోహా : ఖతార్ వైమానిక ప్రాంతం మూసివేత కారణంగా షెడ్యూల్ చేసిన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఖతార్ వైమానిక ప్రాంతాన్ని సురక్షితంగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతనే తమ సంస్థ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఎయిర్లైన్ తెలిపింది.
మార్చి 8న ఉదయం 9 గంటలకు (06:00 UTC) తాజా అప్డేట్ లను ప్రకటిస్తామని X లో ఒక ప్రకటనలో ఎయిర్లైన్ తెలిపింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సురక్షితమైన ఆపరేటింగ్ కారిడార్ను నిర్ధారించిన తర్వాత, ఖతార్ ఎయిర్వేస్ మార్చి 8న లండన్, పారిస్, మాడ్రిడ్, రోమ్, ఫ్రాంక్ఫర్ట్ మరియు బ్యాంకాక్ నుండి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను నడపాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ విమానాలు తుది గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణీకులకు మాత్రమే అని స్పష్టం చేసింది. దోహాలో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య కార్యకలాపాల పునఃప్రారంభానికి నిర్ధారణ కాదని పేర్కొంది.
ప్రయాణికులు తాజా ప్రయాణానికి సంబంధించి ధృవీకరించబడిన టికెట్ ఉంటనే విమానాశ్రయానికి రావాలని ఖతార్ ఎయిర్వేస్ సూచించింది. మరింత సమాచారం, లేదా తాజా అప్డేట్ ల కోసం ఖతార్ ఎయిర్వేస్ అధికారిక ఛానల్స్ ను ఫాలో కావాలని కోరింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









